శరద్ పవార్ కుటుంబంలో బీజేపీ చిచ్చు
పుణె: శరద్ పవార్ ను రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా బారామతిలో 'కుటుంబ పోరు' జరిగేలా భాజపా కుట్ర పన్నిందని సుప్రియా సూలేఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మరోసారి బరిలో దిగిన సుప్రియాపై.. ఆమె సోదరుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె తనకు తల్లితో సమానమని, ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని తగ్గించవని సూలే స్పష్టం చేశారు.
“పవార్ కుటుంబానికి, మహారాష్ట్రకు వ్యతిరేకంగా భాజపా ఈ కుట్ర పన్నింది. సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్ పవార్ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు. కాబట్టే, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సైద్ధాంతికపరంగా సాగే మా పోరును వ్యక్తిగతం చేసింది" అంటూ భాజపాపై సూలే విరుచుకుపడ్డారు.