శరద్ పవార్ కుటుంబంలో బీజేపీ చిచ్చు

శరద్ పవార్ కుటుంబంలో బీజేపీ చిచ్చు

పుణె: శరద్ పవార్ ను రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా బారామతిలో 'కుటుంబ పోరు' జరిగేలా భాజపా కుట్ర పన్నిందని సుప్రియా సూలేఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో  ఈ స్థానం నుంచి మరోసారి బరిలో దిగిన సుప్రియాపై.. ఆమె సోదరుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె తనకు తల్లితో సమానమని, ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని తగ్గించవని సూలే స్పష్టం చేశారు.

“పవార్ కుటుంబానికి, మహారాష్ట్రకు వ్యతిరేకంగా భాజపా ఈ కుట్ర పన్నింది. సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్ పవార్ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు. కాబట్టే, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సైద్ధాంతికపరంగా సాగే మా పోరును వ్యక్తిగతం చేసింది" అంటూ భాజపాపై సూలే విరుచుకుపడ్డారు.

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?