బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టు మృతి

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కర్చోలి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక వారం రోజులలోనే సుమారు 20 మంది మావోయిస్టులను పోలీసులు హత మార్చారు. బీజాపూర్‌ ఎస్‌పి ఏ.వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం గంగలూరు అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, జిల్లా పోలీస్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు అడవిలో పొంచి ఉండి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు దాడిని తిప్పి కొట్టి.. కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మావోయిస్టు మృతి చెందారని తెలిపారు. వారిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన కరపత్రాలు మందు గుండు సామాగ్రి వైర్లు తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?