బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కర్చోలి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక వారం రోజులలోనే సుమారు 20 మంది మావోయిస్టులను పోలీసులు హత మార్చారు. బీజాపూర్ ఎస్పి ఏ.వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం గంగలూరు అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, జిల్లా పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు అడవిలో పొంచి ఉండి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు దాడిని తిప్పి కొట్టి.. కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మావోయిస్టు మృతి చెందారని తెలిపారు. వారిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు మావోయిస్టులకు చెందిన కరపత్రాలు మందు గుండు సామాగ్రి వైర్లు తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు