ప్రజల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటే మళ్లి జగన్ రావాలి
జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా
మదనపల్లె, ( జర్నలిస్ట్ ఫైల్ ) :పేదల జీవితాల్లో వెలుగులు కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా పేర్కొన్నారు. సోమవారం రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ ల గెలుపు కోసం అన్నమయ్య జిల్లా వక్ప్ బోర్డు చైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా, వార్డు కౌన్సిలర్ షేక్ షబానా ల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తోలుత స్థానిక 14వ వార్డు పరిధిలో శేష్ మహల్ థియేటర్ సమీపంలో గల వినాయక స్వామి ఆలయం నందు ముందుగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ ఏ కరీముల్లా మాట్లాడుతూ నవరత్నాలు సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చారన్నారు.పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్సార్సీపిని ఆదరించాలన్నారు.ఇంత పెద్ద మొత్తంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ వైసీపీకి ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రియాజ్,బాబాజాన్,నూర్ మొహిద్దిన్ ఖాన్,రఫీ,కమల్ ఖాన్,తాజ్ బాషా,మారెన్న,రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.