మదనపల్లి కి షర్మిల రాక 

మదనపల్లి కి షర్మిల రాక 

* మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
* గ్రామీణ స్థాయి నుంచి హాజరు కానున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

మదనపల్లి  ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రస్తుత వైసీపీ పాలనను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర మంగళవారం మదనపల్లి జరగనుంది. మొట్టమొదటిసారి మదనపల్లికి షర్మిల వస్తున్నట్టంతో మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా గ్రామీణ స్థాయి నుంచి పెద్ద ఎత్తు కార్యకర్తలు పాల్గొనేలా మల్లెల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సోమవారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

షర్మిలమ్మ చేపట్టిన న్యాయ యాత్ర ప్రోగ్రాం జయప్రదం చేయాలని కోరారు. నేడు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, రాష్ట్రంలో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుందని, ప్రత్యేక హోదా కానీ, రాష్ట్ర అభివృద్ధి కి కానీ సహకరించని బీజేపీ కూటమిని, వైసీపీ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం లోను మదనపల్లిలోను పలు అభివృద్ధి కార్యమాలు జరిగాయని సిపిఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు అన్నారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, మదనపల్లి అభివృద్ధి చెందాలి అంటే మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేంద్ర రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?