కింగ్ చార్లెస్-III... క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తొలిసారి జనంలోకి
On
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ క్యాన్సర్ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన.. వ్యాధి నిర్ధరణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్లో పర్యటించి రాణి క్యామిల్లా తో కలిసి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించారు.ఈస్టర్ వేడుకల్లో భాగంగా సెయింట్ జార్జ్ చాపెల్కు వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. తన మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అభిమానులతో కబుర్లు కూడా చెప్పారు. ఆ సమయంలో 'ధైర్యంగా ఉండండి' (కింగ్ చార్లెస్ ను ఉద్దేశిస్తూ) అంటూ అక్కడున్న జనంనినాదాలు చేయడం కనిపించింది.
About The Author
Related Posts
Latest News
జనం కోసం 130 సార్లు బటన్ నొక్కిన జగన్
09 May 2024 18:08:49
జగన్ కోసం 2 సార్లు బటన్ నొక్కేందుకు సిద్ధమైన జనంపశ్చిమలో వైసీపీ జోరు ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి ప్రచార హోరుగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )...