రాజ్యాంగ ధర్మాన్ని ఆచరించడమే అంబేద్కర్ కి ఇచ్చే అసలైన నివాళి.

రాజ్యాంగ ధర్మాన్ని ఆచరించడమే అంబేద్కర్ కి ఇచ్చే అసలైన నివాళి.

( జర్నలిస్ట్ ఫైల్ )

 భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం ప్రకారం అనుసరిస్తూ రాజ్యాంగ ధర్మాన్ని ఆచరించడమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఇచ్చే అసలైన నివాళి అని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా చల్లపల్లి మండలం నాదెళ్ల వారిపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదని, దేశంలో 140 కోట్ల మందికి పైగా భారతీయులకు నాయకుడని అన్నారు. భారతదేశ నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని అన్నారు. సాంఘిక సంస్కర్తగా అంబేద్కర్ తన జీవితాన్ని కుల వివక్షను రూపుమాపడానికి అణగారిన వెనుకబడిన వర్గాలకు ఉద్ధరించడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు.

అంబేద్కర్ ఎప్పుడు గౌరవభావంతో స్మరించుకోవాలిసిన అరుదైన వ్యక్తి అని కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతయతమైన పౌరులుగా ప్రవర్తించాలని సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు మేడేపల్లి వెంకటేశ్వరావు, సుబ్బారావు,లైన్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం ,మద్దాల వెంకటేశ్వరావు, నలిగిల సుబ్బారావు, మేడేపల్లి బుజ్జిబాబు, దోవ రమణయ్య, నలిగిల శ్రీనివాసరావు, భూ ప్రవీణ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?