దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి

సుస్థిర నగరాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై అధ్యయనం

దక్షిణ కొరియాలో నామి ఐలాండ్,చియాంగ్ గెచెవోన్ వాగు,హన్ నదిని పరిశీలించిన మంత్రులు

ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దక్షిణ కొరియా పర్యటన

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి,రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి సంస్థ(APEDB)ఆధ్వర్యంలో మంత్రులు,అధికారులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు...స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.40 గంటలకు ఆ దేశ రాజధాని సియోల్ చేరుకున్నారు...ఆ తర్వాత దక్షిణ కొరియాలోని నామీ ఐ ల్యాండ్ సీఈవో  మిన్ క్యోంగ్ వూ( min keyong woo)తోమంత్రి నారాయణ,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు భేటీ అయ్యారు..దక్షిణ కొరియా లో సహజ సిద్ధమైన,సాంస్కృతిక,సాంప్రదాయక పర్యాటక ప్రదేశం గా ఉన్న నామీ ఐలాండ్ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.సియోల్ లో ఉన్న అతి పెద్ద పర్యాటక ప్రాంతం ఇదే కావడం విశేషం..ఇక్కడ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లతో ఏడాది పొడవునా సంగీత ఉత్సవాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్ధికంగానూ అభివృద్ధి సాధిస్తుంది..నామీ ద్వీపం అభివృద్ధి,పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈవో తో చర్చించిన మంత్రి నారాయణ చర్చించారు.4,60,000 చ.మీ.విస్తీర్ణంలో అందమైన చెట్లు,పూల మొక్కలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నామీ ద్వీపంలో అనుసరిస్తున్న విధానాల ను అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీగా రూపుదిద్దడంలో  పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు...

మధ్యాహ్నం లంచ్ తర్వాత సియోల్ లోని సియోల్ లోని చియాంగ్‌గేచెఒన్ (Cheonggyecheon) వాగు ను మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.30 ఏళ్ల క్రితం  పూర్తిగా మురుగునీటితో తీవ్ర కాలుష్యకారకంగా ఉండి ఆ  తర్వాత అత్యంత పరిశుభ్రంగా మారిన చియాంగ్‌గేచెఒన్ వాగును పరిశీలించారు.2003–2005 మధ్యకాలంలో సీయోల్ నగరంలో మెరుగైన వాతావరణం కల్పించడం కోసం "చియాంగ్‌గేచెఒన్" పునరుద్ధరణ ప్రాజెక్టును స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టింది.సీయోల్ నగర వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం చేసిన ప్రయత్నం ఫలించి నేడు అత్యంత ఆహ్లాదకరంగా  చియాంగ్‌గేచెఒన్  వాగు పరిసర ప్రాంతాలు మారాయి.ముఖ్యంగా గతంలో అత్యంత మురికిగా, కాలుష్య కారకంగా ఉండే"చియాంగ్‌గేచెఒన్" వాగులోని నీరు.. నేడు పునరుద్ధరణ తర్వాత ఎంతో స్వచ్ఛంగా మారడం, గాలి నాణ్యత పెరగడం, శబ్ద కాలుష్యం తగ్గడం.. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడటం ఈ వాగు పునరుద్ధరణలో ప్రత్యేకత.ఏపీలో కాలుష్య కారకంగా మారిన నదులు, కాలువలు, వాగులు వంటి వాటిని పునరుద్ధరించే కోణంలో ఈ వాగును మంత్రులు,ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎం.టీ.కృష్ణ బాబు, కన్నబాబు పరిశీలించారు.

సాయంత్రం దక్షిణ కొరియాలో హన్(HAN) నదిని మంత్రులు పరిశీలించారు.దక్షిణ కొరియా రాజధాని సీయోల్ ను నగరం మధ్యలో ప్రవహించే హన్ నది.. నదీ పరిసర ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. సియోల్ అభివృద్ధిలో అంతర్భాగంగా నిలుస్తూ, నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణ కల్పిస్తూ.. పర్యాటకులను ఆకర్షిస్తుండటం హన్  నది యొక్క ప్రత్యేకత.అమరావతి నిర్మాణంలో సైతం ఇటువంటి ఆహ్లాదకర వాతావరణం కల్పించే కోణంలో హన్ నది తీర ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు.హాన్ నది పరివాహక ప్రాంతంలో అనేక పార్కులు, వంతెనలు, సైకిల్ మార్గాలు వంటి అభివృద్ధి నిర్మాణాలతో ఆధునిక రాజధానులకు సరికొత్త రూపంగా సియోల్ నిలుస్తుంది..కృష్ణానది తీరంలో అమరావతి రాజధాని నిర్మిస్తున్న క్రమంలో హన్ నది.. తరహాలో ఆధునిక రాజధాని నిర్మాణంలో కృష్ణ తీరంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలపై మంత్రులు స్థానిక అధికారులతో చర్చించారు.

రాత్రికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషికాంత్ సింగ్ ,శ్రీమతి షాలిని సింగ్ దంపతుల ఆహ్వానం మేరకు స్థానిక శరవణ భవన్ లో  మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు టి. కృష్ణ బాబు, కాటమనేని భాస్కర్, కన్నబాబు తదితరులు హాజరయ్యారు.

About The Author

Latest News