అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమాన బహుమతిపై వివాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమాన బహుమతిపై వివాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు, ఊచితంగా కోట్ల రూపాయల విలువ గల విమానాన్ని బహుమతిగా అందుకోవడం మూర్ఖత్వం అవుతుందని. ఖతార్ పాలకుల నుంచి ట్రంప్‌కు విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానం బహుమతిగా అందించాలనుకున్నారు. ట్రంప్, ఈ విమానాన్ని స్వీకరించేందుకు తన సమ్మతి తెలిపినప్పటికీ, ఇది వివాదానికి దారి తీసింది.

అందులో భాగంగా, ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ సభ్యులు ఈ బహుమతిని జాతీయ భద్రతకు ప్రమాదకరంగా చొప్పించుకొని, విమానాన్ని స్వీకరించడం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళు, ఈ బహుమతితో ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉందా లేదా భద్రతా సమస్యలు తలెత్తుతాయా అన్నట్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ట్రంప్ విమానాన్ని స్వీకరించడం పై మీడియా వేదికగా మాట్లాడుతూ, "మీకు 1 బిలియన్ డాలర్లు లేదా 400 మిలియన్ డాలర్లు ఖరీదు చేసే ఒక విమానం ఉచితంగా ఇస్తే, నాకేదైనా తిరస్కరించడానికి కారణమా?" అంటూ ప్రశ్నించారు. అలాగే, "నేను ఎప్పటికీ ఇలాంటి ఆఫర్‌ను తిరస్కరించను. ఉచితంగా విలాసవంతమైన విమానం ఇస్తే, అది తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుంది" అని స్పష్టం చేశారు.

ఇక, ట్రంప్ ఈ విమానాన్ని పదవీ విరమణ అనంతరం వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుతారా? అనే ప్రశ్నకు ఎంగ్రహం పడ్డ ట్రంప్, "విమానాన్ని అధికారిక లైబ్రరీకి ప్రదర్శన కోసం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పారు.

మధ్యప్రాచ్య పర్యటనలో ఉన్న ట్రంప్ ఖతార్ పాలక కుటుంబం నుండి 747-8 జంబో జెట్ విమానం స్వీకరించడానికి అంగీకరించారు. ఈ విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ కు తగ్గట్టు కొన్ని సాంకేతిక సదుపాయాలతో మార్పులు చేసేందుకు ప్రణాళికలు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఇదంతా జాతీయ భద్రత పై ప్రశ్నలను లేవనెత్తుతూ, డెమోక్రాట్ పార్టీ సభ్యులు, ట్రంప్ ఈ విమానాన్ని స్వీకరించడం సరికాదు అని మండిపడుతున్నారు.

 
Tags:

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని