ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనంగా... 'ఎన్‌జీజిఓ సంఘం' గుంటూరు నగర శాఖ ఎన్నిక

ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనంగా... 'ఎన్‌జీజిఓ సంఘం' గుంటూరు నగర శాఖ ఎన్నిక

గుంటూరు నగర ఏపీఎన్‌జీజీఓ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
ఎస్‌.పీ‌.ఎస్‌. సూరి అధ్యక్షుడు – సిహెచ్‌. కళ్యాణ్‌కుమార్ కార్యదర్శి
అసోసియేట్‌ అధ్యక్షురాలిగా డాక్టర్ వడ్లమూడి విజేత
 
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు నగరంలో సోమవారం ఉద్యోగుల ఉత్సాహం పటాకుల్లా పేలింది!  ఏపీ ఎన్‌జీజిఓ సంఘం గుంటూరు నగర శాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఎన్నిక వేళ ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఉత్సవ వాతావరణంగా మారింది. “జై  ఏపీ ఎన్‌జీజిఓ, జై విద్యాసాగర్, జై ఘంటశాల... ఐక్యతే శక్తి – సేవే లక్ష్యం” నినాదాలతో నగరం మారు మ్రోగింది. ఉత్సాహం, ఉల్లాసం, ఏకమాటత మేళవించిన ఈ  ఎన్నిక వేళ నగర ఉద్యోగులు ఒక కుటుంబంలా కలిసిపోయారు. అన్ని పదవులు ఏకగ్రీవంగా ఖరారవ్వడంతో ఆ క్షణం సభావేదికను హర్షధ్వానాలు కుదిపేశాయి  అది ఉద్యోగుల ఐక్యతా పండుగగా మారింది! . ఐక్యతా భావంతో ముందుకు సాగిన ఉద్యోగులు అన్ని పదవులను ఏకగ్రీవంగా ఖరారు చేసి సంఘ శక్తిని మరోసారి చాటిచెప్పారు. గుంటూరులో ఉద్యోగుల ఏకతకు  ఆనందం ఉత్సవంగా, కొత్త చరిత్రగా నిలిచింది. 
 
 

గుంటూరు నగర ఏపీఎన్‌జీ జిఓ సంఘం ఎన్నికలు సోమవారం నాడు ఉత్సాహభరిత వాతావరణంలో ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. నగరంలోని ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యులు ఐక్యంగా వ్యవహరించడంతో ఏకగ్రీవ ఎన్నికల వాతావరణం నెలకొంది. నగర అధ్యక్షుడిగా ఎస్‌.పి‌.ఎస్‌. సూరి (వైద్య ఆరోగ్య శాఖ), కార్యదర్శిగా సిహెచ్‌. కళ్యాణ్‌కుమార్ (వాణిజ్య పన్నుల శాఖ), అసోసియేట్‌ అధ్యక్షురాలిగా డాక్టర్ వడ్లమూడి విజేత (ప్రొఫెసర్, గుంటూరు మెడికల్ కాలేజ్), కోశాధికారిగా కోటేశ్వరరావు (జిజిహెచ్‌) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె. చిన్నారావు, బి. సాంబశివరావు, ఎస్‌. రామకృష్ణారావు, పీవీ. భావనారాయణ ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలిగా బి. విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్‌. రామకృష్ణారావు, సంయుక్త కార్యదర్శులుగా ఎం. శ్రీనివాసరావు, డి.వి. మురళీకృష్ణ, బి. దుర్గారావు, జి. పాండురంగారావు, బి. అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా పి. సునీత బాధ్యతలు స్వీకరించారు.డీఈసీ సభ్యులుగా ఎం. శ్రీనివాసరావు, టీవీ. శ్రీనివాసరావు, ఎం. రత్నకుమారి, పీవీ. నారాయణమ్మ, ఎం. నాగపావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, సహాయ ఎన్నికల అధికారిగా అమరావతి యూనిట్‌ అధ్యక్షులు అశోక్‌కుమార్ వ్యవహరించారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఉద్యోగులు భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చి ఎన్నికల కేంద్రాన్ని కిక్కిరిసేలా చేశారు.తరువాత నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగూరు షరీఫ్ పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్నికల అధికారి డి.డి. నాయక్ నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి, కృష్ణ కిషోర్, సయ్యద్ జానీబాషా, వెంకటరెడ్డి, విజయ్, తాలూకా సంఘ నాయకులు హనుమంతరావు, మణిరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ ఐక్యతకు ప్రతీకగా మారిన ఈ ఎన్నికల్లో ఉత్సాహం, ఉల్లాసం మేళవించి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో నిండిపోయారు.

Tags:

About The Author

Latest News

అపార న‌ష్టం...ఆదుకోవాలి మీరు అపార న‌ష్టం...ఆదుకోవాలి మీరు
రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లింది రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం చేయండి కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్ర‌భుత్వం మొంథా తుపాను న‌ష్టంపై ఆర్టీజీఎస్‌లో ప‌వ‌ర్ పాయింట్...
కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం
ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనంగా... 'ఎన్‌జీజిఓ సంఘం' గుంటూరు నగర శాఖ ఎన్నిక
సెలవు లేని ఉద్యోగం..తీరిక లేని డ్యూటీలు !
టీడీపీతోనే బీసీల అభ్యున్నతి
మొంథా తుపాను ముప్పు... 
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి