పంజాబ్‌లో కల్తీ మద్యం కలకలం – 14 మంది మృతి, 6 మంది పరిస్థితి విషమం

మజిత ప్రాంతంలో విషాదం, ఐదు గ్రామాల్లో ఉక్కిరిబిక్కిరి

పంజాబ్‌లో కల్తీ మద్యం కలకలం – 14 మంది మృతి, 6 మంది పరిస్థితి విషమం

అమృత్‌సర్‌ (పంజాబ్‌) : పంజాబ్‌లో కల్తీ మద్యం మళ్లీ ప్రాణాలు బలిగొంది. అమృత్‌సర్‌ జిల్లా మజిత పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ మద్యం సేవించిన 14 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదకర ఘటన భంగలి, పటాల్‌పురి, మరారి కలాన్‌, తేరేవాల్‌, తల్వండి ఘుమాన్‌ గ్రామాల్లో చోటుచేసుకుంది. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

ప్రధాన నిందితుడితో పాటు నలుగురు అరెస్టు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ప్రభజీత్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రభజీత్‌ సోదరుడు కుల్బీర్‌ సింగ్‌ అలియాస్‌ జగ్గు, సాహిబ్‌ సింగ్‌ అలియాస్‌ సరారు, గుర్జంత్‌ సింగ్‌ (మార్డి కలాన్‌), జీత భార్య నిందర్‌ కౌర్‌ (తిరెన్వాల్‌) ఉన్నారు.

ఇంత మంది ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం ఎక్కడి నుండి వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు తెలిపారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని