గుంటూరులో భారీగా కార్డెన్ సెర్చ్‌ ఆపరేషన్‌

గుంటూరులో భారీగా కార్డెన్ సెర్చ్‌ ఆపరేషన్‌

గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్‌కి చెందిన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని భారీ సంఖ్యలో వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మొత్తం 66 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించినట్టు వెల్లడించారు. వారిలో నలుగురు రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించామని, మరో వ్యక్తి ఇతర ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడని చెప్పారు. గుంటూరు నగరంలో అసాంఘిక చర్యలను అరికట్టేందుకు ఇలాంటి సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని