గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన

గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన

గుంటూరు  (జర్నలిస్ట్ ఫైల్): : నేరాల నిర్మూలనకు గుంటూరు జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. పాత, కొత్త నేరస్తుల కదలికలపై నిఘా పెంచుతూ, క్షేత్రస్థాయిలో సందర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట 1వ లైన్ నుంచి శారద కాలనీ 21వ లైన్ వరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం సాయంత్రం కాలినడకన పర్యటించారు.

నేరచరిత్ర ఉన్నవారి నివాసాలను స్వయంగా పరిశీలించిన ఎస్పీ… వారి కుటుంబ సభ్యులను పలకరించి, భవిష్యత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న వివాదాల్లోనైనా పాల్గొంటే తీవ్రంగా ఎదుర్కొవలసి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి మీద పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, నిఘా కొనసాగుతోందని వివరించారు.

నగరంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలీసుల కర్తవ్యం ప్రజల రక్షణేనని… ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.ఈ పర్యటనలో డీఎస్పీ అరవింద్, ఎస్‌బి-1 సీఐ అలహారి శ్రీనివాస్, అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ఎస్సైలు కృష్ణబాజీ, ప్రసన్నకుమార్, ఆంజనేయులు, రోజాలత పాల్గొన్నారు.

 

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని