తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి

హైదరాబాద్‌: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది.

పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్‌టైం (ఓటీ) వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది. అలాగే ఉద్యోగులు రోజుకు 6 గంటల పని అనంతరం కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, విశ్రాంతి సమయాన్ని కలిపి రోజుకు 12 గంటల కంటే ఎక్కువగా పని చేయించకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త మార్గదర్శకాలతో ఉద్యోగుల హక్కులను కాపాడుతూ, వ్యాపార రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని పేర్కొంది.

About The Author

Related Posts

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం