అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
On
ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) : మండు వేసవిలోనూ నిండుకుండలా ఉండే జలాశయాల్లో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఒకటి. కానీ ఇది ఒకప్పటి మాట. అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వాయర్ రెండు గేట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర దాటింది. కొత్తవి పెట్టించి, మిగిలిన గేట్లకు మరమ్మతులు చేయించాల్సిన సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా జలాశయంలో ఉన్న నీరంతా సముద్రం పాలైంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తమ్మవరం వద్ద గుండ్లకమ్మ జలాశయంలోని చాలాప్రాంతం ప్రస్తుతం నీటి నిల్వలు లేక పచ్చిక బయళ్లతో కనిపిస్తోంది. దీంతో స్థానికులు అందులో పశువులను మేపుతున్నారు. జలాశయం కుడి, ఎడమ కాల్వల ద్వారా రబీ, ఖరీఫ్ లో 1.40 లక్షల ఎకరాలకు సాగు నీరు, ఒంగోలు పట్టణానికి తాగు నీరు అందిస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్ గేట్లకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
About The Author
Related Posts
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...