వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

'మిస్ య చీక్స్' అంటూ గంభీర్ స్పందన

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘సింహం లాంటి ప్యాషన్ కల వ్యక్తి.. మిస్ య చీక్స్’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తపై గంభీర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు కూడా స్పందించారు.

కోహ్లీ 2011లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 టెస్టుల్లో పాల్గొని 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. అతని వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ 254 పరుగులు. టెస్టు కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

About The Author

Related Posts

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం