బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

టెస్ట్‌ క్రికెట్‌ రిటైర్మెంట్‌ తర్వాత తొలి ప్రజా కార్యక్రమంలో కోహ్లీ

బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

 టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే తన తొలి వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌కు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్లిన కోహ్లీ, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గురువు వారికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. కోహ్లీ-అనుష్క దంపతుల బృందావన్‌ ధామ్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ కోహ్లీ ఇక్కడికి పలు మార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన విరాట్‌ కోహ్లీ... తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 113 మ్యాచ్‌లు ఆడి, 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

About The Author

Related Posts

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం