బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

టెస్ట్‌ క్రికెట్‌ రిటైర్మెంట్‌ తర్వాత తొలి ప్రజా కార్యక్రమంలో కోహ్లీ

బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

 టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే తన తొలి వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌కు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్లిన కోహ్లీ, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గురువు వారికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. కోహ్లీ-అనుష్క దంపతుల బృందావన్‌ ధామ్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ కోహ్లీ ఇక్కడికి పలు మార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన విరాట్‌ కోహ్లీ... తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 113 మ్యాచ్‌లు ఆడి, 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి