నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !

నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !

ఏపీ సచివాలయంలో బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లోనే ఉంది! పదోన్నతుల కల నిజం కావాలంటే... బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులందరూ ఒకే త్రాటిపైకి వచ్చి నేటి ఎన్నికల్లో కలిసికట్టుగా ఓటేయకపోతే ఇక ఎప్పటికీ అవకాశం లేదు. సంవత్సరాలుగా సక్రమమైన ప్రమోషన్లను అడ్డగించుకుపోయే అక్రమాలు, అన్యాయాలను ఎదుర్కొన్న మన బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల ఆత్మగౌరవానికి ఇప్పుడు సరిహద్దు దాటే సమయం వచ్చింది. నేడు జరగనున్న సచివాలయ సంఘం ఎన్నికలు కేవలం ఓటింగ్ కార్యక్రమం కాదు… మన హక్కులు, మన గౌరవం, మన భవిష్యత్తును నిర్ణయించే యుద్ధభూమి! ఈ యుద్ధంలో ప్రతి ఓకరు ఉద్యోగి ఒక శక్తిగా, ఒక గళంగా, ఒక వేదికగా నిలుస్తూ పదోన్నతులను సాధించాల్సిన సమయం ఇది! నేడు  జరగనున్న  సచివాలయ సంఘం ఎన్నికలు మన బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల శక్తిని, మన హక్కుల కోసం పోరాటాన్ని చూపే అవకాశం. ప్రతి ఒకరు ఉద్యోగి ఒక గొప్ప శక్తిగా, ఒక గొప్ప గళంగా నిలిచిపడి పదోన్నతులను సాధించాలి, మన హక్కులు తిరిగి మనకు రావాలి!   -  కోట్ల రాజేష్, నాపా ప్రసాద్ సచివాలయ సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శుల అభ్యర్ధులు
 
 
ఏపీ సచివాలయంలో బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల పదోన్నతుల కల సాకారం కావడానికి చివరి దశకు చేరుకుంది. సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అణచివేతలకు చరమగీతం పాడాలంటే నేడు జరగనున్న ఏపీ సచివాలయ సంఘం ఎన్నికలు అత్యంత కీలకమైనవి అని ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  కోర్టు తీర్పులు సానుకూలంగా వున్నప్పటికీ ఓ వర్గం అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్న కారణంగా వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అణచివేతకు గురవుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు సచివాలయ సంఘం ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా మారాయి.

 

హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలును అడ్డుకుంటున్న కారణంగా పదోన్నతుల విషయంలో న్యాయం జరగకపోవడంతో, మెరిట్‌లో ఉన్న అనేక మంది బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులు దశాబ్దాల సీనియారిటీ ఉన్నప్పటికీ చిన్న పోస్టుల్లోనే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. మరికొందరు జూనియర్లు తక్కువ వయసులోనే పదోన్నతులు పొందడం, 15–20 ఏళ్లుగా ఉన్నత హోదాల్లో కొనసాగడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని సృష్టిస్తోంది. కేడర్‌వైజ్ డేటా లేకుండా రిజర్వేషన్లు అమలు చేయరాదు, కాన్సిక్వైంటల్ సీనియార్టీని నిరవధికంగా కొనసాగించరాదు, కోటా మించిన ప్రమోషన్లలో మెరిట్ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని కోర్టులు ప్రత్యేకంగా చెప్పాయి. కానీ ఓ వర్గం పైరవీలతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్ పోస్టుల్లో SC/ST కోటా 2–3 రెట్లు మించిపోయిందని, మెరిట్‌లో ఉన్న 80 శాతం బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులు చిన్న పోస్టుల్లోనే రిటైర్ అవుతున్నారు. తక్కువ వయసులో పదోన్నతులు పొందిన కొంతమంది జూనియర్లు దీర్ఘకాలం ఉన్నత హోదాల్లో కొనసాగడం శాతం బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల ఆత్మగౌరవానికి ఘాతుకరంగా మారుతోంది.

తెలంగాణలో సచివాలయ సంఘం బలంగా వ్యవహరించడంతో కోర్టు తీర్పులు అమలై సమస్య పరిష్కారం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అదే తీర్పులను పక్కన పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు SC/ST రిజర్వేషన్లకు వ్యతిరేకం కావడం లేదని, కేవలం కోటా మించి ఇచ్చిన అక్రమ ప్రమోషన్లను మాత్రమే కోర్టు ఆదేశాల ప్రకారం పునఃసమీక్షించాలంటున్నాయి.

నేటి సచివాలయ సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. ఇవి బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల భవిష్యత్తు, ఆత్మగౌరవం కోసం జరిగే ధర్మపోరాటం అని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సంవత్సరాలుగా పదోన్నతుల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకత్వానికి ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, ఉద్యోగుల హక్కులను రక్షించడానికి బలమైన సంఘాన్ని ఏర్పరచుకోవాలని ఉద్యోగ వర్గాలు పిలుపునిస్తున్నారు.

 బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులందరూ ఒకే వేదికపై నిలిచి తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఓటే మన భవిష్యత్తు అని , బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల పదోన్నతుల కోసం ఏళ్ళ తరబడి పోరాటం చేస్తున్న కోట్ల రాజేష్, నాపా ప్రసాద్ ప్యానలుకు మద్దతుగా ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన నిర్ణయం తీసుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి