థానేలో విషాదం: భవన భాగం కూలి వృద్ధురాలి మృతి

థానేలో విషాదం: భవన భాగం కూలి వృద్ధురాలి మృతి

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముంబ్రా ప్రాంతంలోని దౌలత్ నగర్‌లోని లక్కీ కాంపౌండ్‌లో ఓ భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, ఆమె కోడలు తీవ్రంగా గాయపడింది.

అకస్మాత్తుగా కూలిన పారాపెట్
అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 12.36 గంటలకు నాలుగు అంతస్తుల భవనంలోని ఒక ఫ్లాట్ పారాపెట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డు పక్కన నడుస్తున్న ఇద్దరు మహిళలపై అది పడింది. దీంతో వారిలో ఒకరైన నహిద్ జైనుద్దీన్ జమాలీ (62) అక్కడికక్కడే మరణించగా, ఆమె కోడలు ఇల్మా జెహ్రా జమాలీ (26) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తడ్వి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆ భవనాన్ని పౌరసంఘం ఇప్పటికే ‘C2B’ కేటగిరీలో ప్రమాదకర భవనంగా గుర్తించినట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా భవనంలోని అన్ని ఇళ్లను ఖాళీ చేయించారని, ప్రాంగణానికి సీలు వేశారని వివరించారు. నివాసితులు తమ బంధువుల ఇళ్లలో తాత్కాలిక వసతులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

About The Author

Latest News

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....
బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం