మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్‌ మృతి

మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్‌ మృతి

జమ్ము కశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాంబా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

బారి బ్రాహ్మణ క్యాంప్‌ లో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆఫీసర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనలో ఏదైగా ఉగ్రకోణం ఉందా అనేది తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటన తర్వాత అదే క్యాంప్‌లోని ఓ జవాన్‌ కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పారిపోయినట్లు సమాచారం. అతని కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags:

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి