"ఆరు నెలల జైలు సరిపోదా?"

కావాలనే కుట్రలు పన్నుతున్నారు...తెలంగాణ భవన్‌లో కవిత మండిపాటు

హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుండగానే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె... “సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతా” అని స్పష్టం చేశారు.

"ఆరు నెలల జైలు సరిపోదా?"

తనపై దుష్ప్రచారాలు చేస్తున్న వారికి ఉద్దేశించి మాట్లాడుతూ – “ఆరు నెలల జైల్లో ఉండటం సరిపోదా? ఇంకా ఎంత కష్టపెడతారు? ప్రజల కోసం, పార్టీ కోసం పని చేస్తున్నామంటే ఇలా దాడులు ఎందుకు?” అని ప్రశ్నించారు. తనను రెచ్చగొట్టొద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు.

సామాజిక తెలంగాణ గురించి – ప్రజల అభిప్రాయమే ఆధారం

సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రజల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ప్రస్తావించానని కవిత అన్నారు. ఇందులో ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని మాట్లాడలేదని స్పష్టం చేశారు. పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బీఆర్ఎస్ స్పష్టమైన స్పందన ఇవ్వాలని కోరారు.

“బీఆర్‌ఎస్‌కు బలంగా నిలవడం నేనెప్పటికీ కొనసాగిస్తాను”

“నా రాజకీయ ప్రయాణం బీఆర్ఎస్‌తోనే ఉంటుంది. పార్టీకి బలం చేకూర్చడం కోసం నేను ఎప్పటికీ కృషి చేస్తాను” అని కవిత తేల్చిచెప్పారు. తాను పార్టీపై పూర్తిగా నమ్మకం ఉంచినట్లే, పార్టీ కూడా తనపై నమ్మకంతో ఉండాలని కోరారు.


About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని