ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

విరాట్‌తో పాటు రోహిత్‌కీ గౌరవవంతమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని అభిప్రాయం

ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

ముంబై: భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా కోహ్లీ కూడా వైట్ జెర్సీని విడిచి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయగా.. ఫ్యాన్స్ మాత్రం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ రిటైర్మెంట్‌కు గౌరవం దక్కలేదని, బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం కొనసాగుతుంది. జట్టుకు విరాట్ అందించిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి’’ అని వెల్లడించింది.

అయితే ఓ దిగ్గజ క్రికెటర్‌కు ఇదే గౌరవవంతమైన వీడ్కోలా? అంటూ ఫ్యాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను ప్రశ్నించకుండా, ఆటగాళ్లపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ‘‘విరాట్, రోహిత్ ఇద్దరికీ ఘనంగా వీడ్కోలు ఇవ్వాల్సింది’’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Related Posts

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని