ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

విరాట్‌తో పాటు రోహిత్‌కీ గౌరవవంతమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని అభిప్రాయం

ఓ శకం ముగిసింది… విరాట్ రిటైర్‌పై బీసీసీఐకి ఫ్యాన్స్ ఆగ్రహం

ముంబై: భారత క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొద్దిరోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా కోహ్లీ కూడా వైట్ జెర్సీని విడిచి పెట్టాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయగా.. ఫ్యాన్స్ మాత్రం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ రిటైర్మెంట్‌కు గౌరవం దక్కలేదని, బలవంతంగా రిటైర్ అయ్యేలా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై బీసీసీఐ స్పందిస్తూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం కొనసాగుతుంది. జట్టుకు విరాట్ అందించిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి’’ అని వెల్లడించింది.

అయితే ఓ దిగ్గజ క్రికెటర్‌కు ఇదే గౌరవవంతమైన వీడ్కోలా? అంటూ ఫ్యాన్స్ బీసీసీఐపై మండిపడుతున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను ప్రశ్నించకుండా, ఆటగాళ్లపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ‘‘విరాట్, రోహిత్ ఇద్దరికీ ఘనంగా వీడ్కోలు ఇవ్వాల్సింది’’ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

About The Author

Related Posts

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం