గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
On
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది.
మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని, ఆ రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని టిజిపిఎస్సి ఆదేశించింది. రీవాల్యుయేషన్ సాధ్యం కానట్లయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పు ఇచ్చి ఫలితాలను రద్దు చేసింది.
About The Author
Latest News
09 Sep 2025 19:52:57
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....