అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు!

‘#సింగిల్’ విజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన యువ కథానాయకుడు

అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు!

యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అంటే ఎంతగా ఇష్టం ఉందో సినీ ప్రేక్షకులకు తెలిసిందే. మీడియా వేదికగా ఎన్నోసార్లు ఆయనను తన అభిమాన హీరోగా పేర్కొన్న శ్రీవిష్ణు, ఇప్పుడు ఆ కలను నెరవేర్చే దశలో ఉన్నాడు.

ఇటీవలే విడుదలైన '#సింగిల్' సినిమాలో పలువురు స్టార్ హీరోలను ఇమిటేట్ చేసిన శ్రీవిష్ణు... క్లైమాక్స్‌లో మాత్రం వెంకటేశ్‌ మేనరిజంలను అద్భుతంగా కాపీ చేసి థియేటర్లలో హాస్య వాతావరణాన్ని నెలకొల్పాడు. ఆ సినిమా మొదటి వారం ముగిసే సరికి దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఇది శ్రీవిష్ణుకు పెద్ద హిట్‌గా నిలిచింది.

ఓ విశేషం ఏంటంటే... '#సింగిల్' విడుదలైన మే 9వ తేదీ, వెంకటేశ్‌కు సెంటిమెంట్ డేట్. అదే రోజున 1997లో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే మే 9న శ్రీవిష్ణు భారీ హిట్ కొట్టడం ఆసక్తికరమైన విషయం. వెంకటేశ్‌ను అభిమానించే శ్రీవిష్ణుకు ఇది బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు.

ఇప్పుడు అభిమానులందరికీ మజా అందించేందుకు మరో గుడ్ న్యూస్!
దర్శకుడు రామ్ అబ్బరాజు— గతంలో శ్రీవిష్ణుతో చేసిన ‘సామ జవర గమన’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు... ఇప్పుడు వెంకటేశ్, శ్రీవిష్ణును కలిపే స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించాడు. ‘‘నా అభిమాన నటుడితో కలిసి నటించాలనేది ఓ కల. అది త్వరలో నెరవేరబోతుంది’’ అని ఆనందాన్ని పంచుకున్నాడు.

ఇప్పటికే వెంకటేశ్ నటించిన సంక్రాంతి హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో శ్రీవిష్ణు '#సింగిల్' విజయంతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన స్థానం తిరిగి సంపాదించుకున్నాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేయనున్న సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్టు సమాచారం. అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

About The Author

Related Posts

Latest News

ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ? ఒక్క డీఏతో పండగ చేసుకోమంటున్నారా ?
-ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల  చైర్మన్ వెంకట్రామిరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) :ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాకర్ల...
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం  : సీఐటీయూ 
ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం