ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

తిమ్మాపురంలో బహుళ ప్రయోజన గోదాం ప్రారంభంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు

ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించేలా చేస్తాం 

 ప్రత్తిపాడు ( జర్నలిస్ట్ ఫైల్ ) :ప్రత్తిపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మితమైన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తో కలిసి పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడినని, చిన్ననాటి నుంచి రైతుల సమస్యలు చూడగలిగానని తెలిపారు. మామూలుగా రైతులు తాము పండించిన పంటలకు తగిన ధర రాకపోవడం, దళారుల చేతిలో నష్టపోవడం జరుగుతుంటుందని, అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి గోడౌన్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వాస్తవంగా ప్రస్తుతం భూముల ధరలు పెరిగిపోతున్న వేళ, తానున్న భూమిని ప్రజల కోసం దానం చేసిన దొప్పలపూడి సాంబశివరావు లాంటి వారు అభినందనీయం అని కొనియాడారు. ఇటీవల కాలంలో రోడ్ల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని, గత ఎన్నికల సమయంలో తాము ప్రయాణించిన దారులు ఇప్పుడు కొత్త రహదారులుగా మారి కనిపిస్తున్నాయని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధిని తీసుకొచ్చే బాధ్యతను తాను, రామాంజనేయులు కలిసి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గోడౌన్ నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన దొప్పలపూడి సాంబశివరావు, ఆయన భార్య ఉమాదేవి, గోదాం నిర్మాణ పర్యవేక్షణ చేపట్టిన సర్పంచ్ కల్లూరి శ్రీనివాస్ రావులను మంత్రి సత్కరించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద్ద రత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, టీడీపీ మహిళా నేత వందనాదేవి, జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని