తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ
 
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ )  :  తెలంగాణ ( Telangana ) రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ( Rudra Rajesam )  ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy )  ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్ని.. జూన్ 2న ఆవిష్కరించనున్నారు.
 
ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన 'జయ జయహే తెలంగాణ'కు ( Jaya Jayahe Telangana ) తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల గీతంలో కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం రేవంత్, అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ గీతాన్ని కూడా జూన్ 2న  ఆవిష్కరించనున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి రూపం ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.

About The Author

Latest News

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....
బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం