ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపీఎన్జీజీవోస్‌ అసోసియేషన్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారంజారీ అయింది. గుంటూరు జిల్లా కార్యవర్గం ఎన్నికల అధికారిగా డి.డి. నాయక్‌ను, సహాయ ఎన్నికల అధికారిగా బి. అశోక్‌ కుమార్‌ను, పర్యవేక్షకుడిగా ఎస్‌. రాజశేఖర్‌ను నియమించింది.

జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం గుంటూరు అర్బన్‌, రూరల్‌, పెదకాకాని మండలాలను కలుపుకుని గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌కు ఎన్నికలు నిర్వహించబడనున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమం నవంబర్‌ 7న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నామినేషన్‌ దాఖలు నవంబర్‌ 10న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. నవంబర్‌ 17న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏపీఎన్జీజీవో హోమ్‌లో ఎన్నికా ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రతిని యూనిట్‌ అధ్యక్షుడు ఎస్‌.పీ‌.ఎస్‌. సూరి, కార్యదర్శి సిహెచ్‌. కళ్యాణ్‌ కుమార్‌ లకు అందజేయడం జరిగింది. అలాగే నోటీస్‌ బోర్డులో కూడా షెడ్యూల్‌ను ప్రదర్శించారు. గుంటూరు తాలూకా పరిధిలోని ఉద్యోగులందరికీ ఎన్నికల వివరాలు తెలియజేయబడ్డాయి.

About The Author

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి