వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

'మిస్ య చీక్స్' అంటూ గంభీర్ స్పందన

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘సింహం లాంటి ప్యాషన్ కల వ్యక్తి.. మిస్ య చీక్స్’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తపై గంభీర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు కూడా స్పందించారు.

కోహ్లీ 2011లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 టెస్టుల్లో పాల్గొని 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. అతని వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ 254 పరుగులు. టెస్టు కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

About The Author

Related Posts

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం