వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

'మిస్ య చీక్స్' అంటూ గంభీర్ స్పందన

వైట్ జెర్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ

ముంబై: భారత క్రికెట్ అభిమానులకు కింగ్ విరాట్ కోహ్లీ షాకింగ్ వార్త చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణయం అభిమానులను కలచివేసింది. ఇకపై వైట్ జెర్సీలో తమ అభిమాన క్రికెటర్‌ని చూడలేమని భావించిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మాత్రం కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘‘సింహం లాంటి ప్యాషన్ కల వ్యక్తి.. మిస్ య చీక్స్’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తపై గంభీర్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, విదేశీ క్రికెటర్లు కూడా స్పందించారు.

కోహ్లీ 2011లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 టెస్టుల్లో పాల్గొని 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. అతని వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ 254 పరుగులు. టెస్టు కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన కోహ్లీ వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి