బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు

బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు

28 సంవత్సరాల నిబద్ధతకు పార్టీ గుర్తింపు
 

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్):  28 సంవత్సరాలుగా భారతీయ జనతాపార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వెలగలేటి గంగాధర్‌ను రాష్ట్ర బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజేపీ పార్టీకీ దశాబ్దాల తరబడి గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ భాజపా రాష్ట్ర పబ్లిసిటీ ,లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బ్రాడీపేట లోని కార్యాలయంలో మంగళవారం  ఘనంగా అభినందన కార్యక్రమం జరిగింది . 

కార్యక్రమంలో రిటైర్డ్ ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ పాతూరి మధుసూదనరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఏఈస్ జీ. నరసింహరావు, రియల్ ఎస్టేట్ అధినేత ఓరుగంటి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ స్త్రీ శిశు సంక్షేమశాఖ సూపరింటెండ్ వేములూరి ప్రసాద లింగం, పార్టీ నాయకులు ఈమని మాధవరెడ్డి, ప్రతాప ప్రసాద్, సాయి రాధాకృష్ణ, మారుతి గౌతమ్ పాల్గొన్నారు.

పాలపాటి రవికుమార్ మాట్లాడుతూ, గంగాధర్ పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా నిజాయితీగా పనిచేశారని, ఆయనకు భాజపా ఇచ్చిన గౌరవమే డైరెక్టర్ బాధ్యత అని తెలిపారు. ఆయన కార్పొరేషన్ అభివృద్ధికి, పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.గంగాధర్ మాట్లాడుతూ, తనకు ఈ పదవి రావటానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Latest News

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా విజయం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ.ఎస్. సుదర్శన్ రెడ్డి పై స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించారు....
బ్రాహ్మణ వెల్‌ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన గంగాధర్ కు అభినందనలు
భారత్‌పై పాక్‌ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ఖండన
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు – హైకోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ వలన పాలమూరు వెనుకబాటు – కెటిఆర్
నేపాల్‌లో అల్లర్లు ఉదృతం – ప్రధాని ఒలీ రాజీనామా
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం