చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చెక్కు అందజేసిన నాయకులు
మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు చేయించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సోమవారం టీడీపీ నాయకులు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, గ్రామ పార్టీ అధ్యక్షులు గుమ్మా హరిబాబు, బొర్రా కిరణ్ కుమార్, పలగాని గంగాధర్ రావు, మల్లవరపు కోటేశ్వరావు, కుక్క మల్ల శ్రీనివాసరావు, మల్లవరుపు సుమంత్, చాగర్లమూడి నరేంద్ర, ఈపూరి మరియదాసు, గడ్డిపాటి గౌతమ్, మల్లవరపు చిన్నబాబు, పలగాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు.